telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విపక్ష సభ్యులు హద్దుల్లో ఉండాలి: స్పీకర్ ఫైర్

ap speaker tammineni

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలతో సభ అట్టుడికింది. వికేంద్రీకరణ బిల్లుల సందర్భంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపేందుకు ప్రయత్నించగా స్పీకర్ తమ్మినేని సీతారాం సహనం కోల్పోయారు. అచ్చెన్నాయుడు గారూ మీకు సెన్స్ ఉండాలని మండిపడ్డారు.

విపక్ష సభ్యులు హద్దుల్లో ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కోరుతున్నానంటూ స్పీకర్ తమ్మినేని మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. విచారణ జరిపించాలని మీరెలా చెబుతారు అంటూ స్పీకర్ ను వారు ప్రశ్నించారు. దాంతో మండిపడిన తమ్మినేని “డోంట్ టాక్ రబ్బిష్!” అంటూ నిప్పులు చెరిగారు.

Related posts