తెలంగాణలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం నిన్న కోవిడ్ బులెటిన్ వెల్లడించలేదు. నిన్నటి వివరాలను ఈ రోజు వెల్లడించింది. 24 గంటల్లో 15,654 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,593 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
జీహెచ్ఎంసీలో కొత్తగా 641 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,059 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 12,264 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 463కు చేరింది.
గుళ్లు,గోపురాలకు తిరగడానికే గవర్నర్: వీహెచ్