నా భార్య నైతిక విలువలున్న మనిషి అని పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఛండీఘర్ నుంచి పోటీ చేయాలనుకున్నారని తెలిపారు. తన భార్యకు టికెట్ రాకుండా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అడ్డుకున్నారని ఆయన తెలిపారు. తనకు టికెట్ రాకుండా పంజాబ్ సీఎం అడ్డుకున్నారని సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల పై సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. వజ్యోత్ కౌర్ ఛండీఘర్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఛండీఘర్ పంజాబ్ కిందకు రాదని తెలిపారు.
అమృత్సర్ నుంచి లేదా భటిండా నుంచి పోటీ చేయమని నవజ్య్త్ కౌర్కు సూచన చేశాం. అని తెలిపారు. అందుకు ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. టికెట్ల కేటాయింపు అంశం కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. ఆమెకు ఛండీఘర్ సీటు కేటాయించకపోవడంలో తన పాత్ర లేదు అని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ అమృత్సర్ టికెట్ ఇచ్చేందుకు తాము సుముఖంగా ఉన్నప్పటికీ కౌర్ నిరాకరించిందని అమరీందర్ సింగ్ చెప్పడం దారుణమని సిద్ధూ పేర్కొన్నారు.