telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేరళ అసెంబ్లీని సందర్శించిన తెలంగాణ స్పీకర్

pocharam srinivasreddy

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేరళ అసెంబ్లీని సందర్శించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం కేరళ రాజధాని తిరువనంతపురంకు పోచారం చేరుకున్నారు. పనులను ముగించుకున్న అనంతరం కేరళ అసెంబ్లీకి వెళ్లారు. ఈ క్రమంలో స్థానిక అసెంబ్లీ స్పీకర్ పి. రామకృష్ణన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు.

వారిద్దరు కలిసి అసెంబ్లీ హాల్ మొత్తం తిరిగి పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, ఇతర అంశాలపై వారి చర్చించారు. కేరళ ప్రభుత్వం తరఫున శ్రీరామకృష్ణన్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జ్ఞాపిక, పుస్తకాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కేరళ అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts