telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

33 ఏళ్లుగా.. కేవలం టీ తాగి .. ఆరోగ్యంగా బ్రతికేస్తూ…

women living with just tea from 33years

అలవాటైన ప్రాణం గిలగిలలాడిపోతుంది అన్నట్టుగా.. రోజు మూడుపూటలా లేదా నాలుగు పూటలా తినడం అలవాటు అయిన మనం ఒక్కపూట ఉపవాసం ఉండమంటే.. అల్లాడిపోతాం. ఇక రోజు అంతా ఉపవాసం అంటే, వామ్మో వల్లే కాదు అనేస్తాం కదా. అయితే ఇక్కడ ఒక మహిళ 33ఏళ్లుగా కేవలం టీ తాగి బ్రతికేస్తుంది, అదికూడా ఆరోగ్యంగా…ఆ వివరాలు చూడండి.. ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొఠియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లి దేవి ప్రత్యేకత ఇదంతా!

11 ఏళ్ల వయసులో ఆహారాన్ని తీసుకోవడం మానేసిన దేవి వయసు ప్రస్తుతం 44 ఏళ్లు. 33 ఏళ్లుగా ఆమె ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం మరో ప్రత్యేకత. ఆరో తరగతిలో ఉండగా తన కూతురు తిండి తినడం మానేసిందని దేవి తండ్రి రతీరామ్ తెలిపారు. ‘జనక్ పూర్ లోని పాట్నా పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొనేందుకు దేవి వెళ్లింది. ఆ తర్వాత నుంచి తిండి, నీళ్లు మానేసింది’ అని రతీరామ్ వాపోయారు.

కొన్నాళ్లు టీతో బిస్కెట్లు, బ్రెడ్ తినేది. ఆ తర్వాత పూర్తిగా బ్లాక్ టీ మీదే బతుకుతోందన్నారు. ఇప్పుడామె సూర్యాస్తమయం తర్వాత ఒకసారి కప్పు బ్లాక్ టీ మాత్రం తాగుతుందని తెలిపారు. రోజంతా శివారాధనలోనే గడుపుతుందని, ఎప్పుడో తప్ప ఇంటి నుంచి అడుగు బయటపెట్టదని తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమోనని కంగారుపడి డాక్టర్ల వద్దకు తీసుకుపోతే ఆమె ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పారని వివరించారు. మనుషులు కేవలం టీ తాగి బతకడం అసాధ్యమని, 33 ఏళ్లుగా ఆమె టీతో జీవించడం ఆశ్చర్యపరుస్తోందని కొఠియా జిల్లా ఆసుప త్రి వైద్యుడు ఎస్.కె.గుప్తా అన్నారు.

Related posts