కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక శుక్రవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి
ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది. చిన్న సినిమాగా 100 పర్సెంట్ తెలుగు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా జాతీయ స్థాయిలో మన్ననలు పొదడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్ క్యారెక్టర్లో.. పవర్ ఫుల్ విలన్గా సునీల్ కనిపించారు.
బిగ్బాస్పై గీతామాధురి కామెంట్స్ …