యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. “జాన్” అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు 180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల జార్జియా ప్రారంభించిన ఈ సినిమా షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘మరో షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ ఇంత తర్వగా పూర్తి కావడానికి జార్జియన్ టీమ్ ఎంతగానో సపోర్ట్ చేసింది. త్వరలోనే మా సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేస్తాం’’ అన్నారు రాధాకృష్ణ. పీరియాడికల్ లవ్స్టోరిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రభాస్ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తుంది.
previous post
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య కామెంట్స్