telugu navyamedia
సినిమా వార్తలు

నిలకడగా టీవీ నటి మైథిలి ఆరోగ్య ప‌ర‌స్థితి..

తెలుగు టీవీ నటి మైథిలి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పిడింది.. తన భర్త సామ శ్రీధర్​రెడ్డి మోసం చేశాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవట్లేదన్న ఆవేదనతో.. పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన తన నివాసానికి వెళ్లి మైథిలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైథిలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వివ‌రాల్లోకి వెళితే..

టీవీ న‌టి మైథిలీ, త‌న భ‌ర్త శ్రీధర్​రెడ్డితో ఎస్సార్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారథి స్టూడియో వెనకాల ఉన్న ఓ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటోంది. గతంలో.. భర్త శ్రీధర్​రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుని తనను చిత్రహింసలు పెడుతున్నాడని సూర్యాపేటలో కుటుంబసభ్యులతో కలిసి మైథిలి ఫిర్యాదు చేసింది.

ఆ సమయంలో కట్నంగా ఇచ్చిన డబ్బు, కారు, నగలు త‌న ద‌గ్గ‌ర‌నుంచి బ‌ల‌వంతంగా తీసుకుని అడిగినా ఇవ్వ‌డం లేద‌ని భర్తపై పంజాగుట్ట పోలీస్‌స్టేష‌న్‌లో చీటింగ్​ కేసు పెట్టింది. పోలీసులు పట్టించుకోకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి.. శ్రీధర్​రెడ్డికి నోటీసులు ఇచ్చారు

ఇదే విషయమై.. నిన్న(మే 30న) మరోసారి పోలీసులను కలవగా.. సరైన సమాధానం రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తాను చేసిన ఫిర్యాదు విషయంలో న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి.. స్లీపింగ్​ పిల్స్​ వేసుకుని లైవ్ సూసైడ్​కు యత్నించింది.

అంతకుముందు తన తండ్రికి కూడా ఫోన్​ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పింది. పోలీసులు హుటాహుటిన త‌న ఇంటికి ఆమెను నిమ్స్ ఆస్ప‌త్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న ఇండ‌స్ర్టీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Related posts