సినీరచయిత సాయిమాధవ్ బుర్రా డాక్టరేట్ అందుకున్నారు… సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అందించారు.
బుధవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించారు..ఈ పురస్కారాన్ని సాయిమాధవ్ తన తల్లిదండ్రులకు అంకితమిచ్చారు..
కాగా, ఈ డాక్టరేట్ ప్రదానోత్సవానికి పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన్ను అభినందించారు.