హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “సైలెన్స్”. తెలుగులో ఈ చిత్రాన్ని “నిశ్శబ్దం” పేరుతో విడుదల చేయనున్నారు. అనుష్క బర్త్డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ముందుగా జనవరి 31న విడుదల చేయాలనుకున్నారు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 20న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క సాక్షి అనే పెయింటర్గా, మాధవన్ మ్యుజిషియన్గా, అంజలి క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్గా కనిపించనున్నారు. ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడిసన్ నెగెటివ్ క్యారెక్టర్ చేశారు.. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కావాలనే కొందరు సూర్యను టార్గెట్ చేస్తున్నారు… భారతీరాజా షాకింగ్ కామెంట్స్