అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజల్ ఇటీవలే కోమలి, రణరంగం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ కలువకళ్ళ సుందరి బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది. బీటౌన్ సమాచారం ప్రకారం “ముంబయి సాగా” అనే బాలీవుడ్ చిత్రంలో కాజల్… జాన్ అబ్రహంతో రొమాన్స్ చేయనుందట. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా నుండి కాజల్ తప్పుకుందని ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసుకున్నారని ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ వార్త సంజయ్ గుప్తా చెవిన పడడంతో ఆయన సోషల్ మీడియావేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు మీడియా వర్గాలు ఇంత దారుణంగా కల్పిత వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించిన ఆయన ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. “ముంబయి సాగా” సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశామని, కాజల్ బ్రిలియంట్ గా నటించారని చెప్పారు. 1980ల కాలం నేపథ్యంలో “ముంబయి సాగా” సినిమాను తెరకెక్కిస్తున్నారు సంజయ్. ఇందులో కాజల్ పాత్ర రెండు విభిన్న కోణాల్లో ఉండబోతోందని చాలా వినోదాత్మకంగా ఉంటుందని వెల్లడించారు. “ముంబయి సాగా” అనే చిత్రంలో బొంబాయి పేరు ముంబయిగా ఎలా మారిందనేది చూపించనున్నారు. ఇక ఆమె నటించిన “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జతకట్టనుంది కాజల్.
previous post
next post