telugu navyamedia
సినిమా వార్తలు

వెధవలకు మాత్రమే ఎందుకు సానుభూతి ?… అమీర్ పై తనుశ్రీ ఫైర్

Tanushree-and-Amir

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమానికి తెరలేపి వార్తల్లో నిలిచారు తనుశ్రీదత్తా. కొంతకాలంగా ఈ విషయంపై మౌనం వహించిన ఆమె తాజాగా అమీర్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి మీడియా ముందుకొచ్చారు. అమీర్ ఖాన్ హీరోగా దర్శకుడు సుభాష్ కపూర్ ‘మొఘల్’ అనే సినిమా తీయలనుకున్నారు. కానీ ఓ యువతి సుభాష్ పై లైంగిక ఆరోపణలు చేయడంతో అమీర్ ఖాన్ సినిమా నుండి తప్పుకున్నారు. కానీ ఆ తరువాత సుభాష్ తనకు ఫోన్ చేసి ఎంతో బాధ పడుతున్నాడని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని.. ఆయన బాధ భరించలేక సినిమా ఒప్పుకున్నానని మీడియా ముందు చెప్పారు అమీర్ ఖాన్. ఈ విషయంపై తాజాగా తనుశ్రీ స్పందించింది. మహిళలు లైంగిక వేధింపు ఎదుర్కొన్నప్పుడు బాలీవుడ్ లో ఏ ఒక్కరూ నిద్రలేని రాత్రులు ఎందుకు గడపలేదని ప్రశ్నించింది. సుభాష్ కోసం సినిమా ఒప్పుకున్న అమీర్.. సుభాష్ కారణంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతిని మాత్రం సినిమాలో ఎందుకు తీసుకోలేదని అడిగింది. బాలీవుడ్ లో ఉన్న వెధవలకు మాత్రమే ఎందుకు సానుభూతి లభించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. నానా పటేకర్ కారణంగా పదేళ్ల క్రితం తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నప్పుడు తన కెరీర్ నాశనమైందని.. అప్పుడు తన గురించి ఎవరూ ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించింది. ‘నా కెరీర్ గురించి మీరెందుకు ఆలోచించలేదు అమీర్’ అంటూ నేరుగా అతడినే ప్రశ్నించింది. మరి తనుశ్రీ ప్రశ్నకు అమీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related posts