telugu navyamedia
సినిమా వార్తలు

ఇద్దరికీ 30 ఏళ్ళు దాటాయి.. ఇద్దరికీ పెళ్లయ్యింది కానీ..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సినిమా “ఆర్ఆర్ఆర్” మూవీ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది .

ఈ క్ర‌మంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో గత రెండు మూడ్రోజుల నుంచి వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. విలేకర్లతో ముచ్చటిస్తున్నారు ఆర్ఆర్ఆర్ మూవీ టీం. ముంబై, బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్ శనివారం ఉదయం హైదరాబాద్‏లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.

రాజమౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్, తారక్ వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నట్లు చెప్పారు. సినిమాను 300 రోజులు షూట్ చేసి ఉంటే వీళ్లిద్దరి వల్ల కనీసం 25 రోజులు ఉంటాయి. ఇద్దరికీ 30 ఏళ్ళు దాటాయి.. ఇద్దరికీ పెళ్లయ్యింది… వెనుక అన్నా చచ్చిపోతాం అంటూ
ల‌క్ష‌ల లక్ష‌ల‌..కోట్ల కోట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కానీ.. సెట్లో మాత్రం ఇద్దరూ గొడవ పడేవారని.. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన వద్దకు వచ్చి.. జక్కన్నా.. నన్ను చరణ్ గిల్లాడు అని చెప్పేవాడు..వెంటనే చరణ్.. నేనా.. ఎప్పుడు గిల్లాను అంటూ నేను స్క్రిప్ట్ లైన్స్ చదువుకుంటున్నానని అమాయకపు ముఖం పెట్టి చెప్పేవాడని రాజమౌళి అన్నారు.

అయితే వీరిద్దరి గొడవల గురించి చెబుతున్న సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్న రాజమౌళి గిల్లాడు. దీంతో వెంటనే ఎగిరిపడి పక్కనే నిల్చుని మాట్లాడాడు రాజమౌళి.. దీంతో రాజమౌళి కామెంట్స్ వెంటనే స్పందించిన తారక్ “ఆరోజు నాపై దాడిని ఆపారా? పేదరాయుడిలా కూర్చొని చూశారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు” అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఈ లోపు ప‌క్క‌నే ఉన్న చ‌ర‌ణ్‌ లేచి తమ గొడవల గురించి చెప్పొద్దని రాజమౌళిని విజ్ఞప్తి చేయడం జ‌రిగింది.

Related posts