టీవీ నటి దివ్య అగర్వాల్ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయడంతో ట్రోలింగ్ బారిన పడింది. అసలేం జరిగిందంటే… ఇటీవల దివ్య తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. అయితే ఇది జరిగి వారం రోజులు కూడా గడవక ముందే నటి దివ్య ఓ మ్యాగజైన్ కవర్ఫోటో షూట్ చేసింది. హాట్ హాట్ అందాలతో ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు ట్రోలర్స్. దీనిపై దివ్య అగర్వాల్ సైతం ఘాటుగానే స్పందించారు. “ప్రస్తుత సమాజం కేవలం ఎదుటివాళ్ల బాధనే కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో మూవ్ ఆన్ అయ్యి మళ్లీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారేమో” అంటూ ట్రోల్స్ పై తన స్పందనను తెలియజేసింది దివ్య.
previous post