telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”కు షాకిచ్చిన సుప్రీమ్ కోర్టు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చిత్రం గతనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. అయితే “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను ఆంధ్రప్రదేశ్ లో విడుదల చెయ్యకుండా ఏప్రిల్ 3 వరకు ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అనుకున్న సమయానికి ఆంధ్రాలో సినిమాను విడుదల చేయలేకపోయిన వర్మ తెలంగాణాలో మాత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని చిత్రనిర్మాత రాకేష్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ఈరోజు ఉదయమే దాఖలు కాగా, అత్యవసర విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఏప్రిల్ 3న హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎందుకు ఆగట్లేదని ప్రశ్నించారు. హైకోర్టే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని, అక్కడ వ్యతిరేక నిర్ణయం వస్తే అప్పుడు తమను ఆశ్రయించాలని అన్నారు.

Related posts