telugu navyamedia
సినిమా వార్తలు

300 మంది పిల్లల భవిష్యత్తుకు బాధ్యత ఈ యంగ్ హీరోదేనట…!

Nikhil

యంగ్ హీరో నిఖిల్ లోని మానవత్వం ఏంటో తాజాగా మరోసారి నిరూపితమైంది. తాజాగా నిఖిల్ చేసిన ప్రకటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భీమవరంకి చెందిన 300 మంది విద్యార్ధుల చ‌దువుకి అయ్యే ఖ‌ర్చు అంతా తాను భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించాడు నిఖిల్. వారు పాఠ‌శాల‌కి వెళ్ళ‌డం నుండి చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని తానే చూసుకుంటాన‌ని నిఖిల్ ట్వీట్ ద్వారా తెలిపాడు. “ఇలాంటి బృహ‌త్కార్యంలో భాగ‌స్వామిని చేసిందుకు మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా” అని నిఖిల్ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు నిఖిల్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంకా కొంతమంది సెలెబ్రిటీలు ఇలాంటి మంచి పనులకు పూనుకోవాలని కోరుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నిఖిల్ న‌టించిన “అర్జున్ సుర‌వరం” చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం “కార్తికేయ” చిత్ర సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెర‌కెక్కించ‌నున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించ‌నుంది.

Related posts