telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సన్నగా మారి విమర్శల పాలవుతున్న కీర్తి…!!

Keerthy-Suresh

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తరవాత ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలతో మరింత ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇక ‘మహానటి’ సినిమాతో సూపర్ స్టార్ హోదాను తెచ్చుకుంది. “మహానటి” సావిత్రి పాత్రలో జీవించేసిన కీర్తి సురేష్.. ఆ ఒక్క సినిమాతో అందరినీ తనవైపు తిప్పుకుంది. అంతేనా, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. సావిత్రి మాదిరిగానే కీర్తి సురేష్ బొద్దుగా ఉండటమే దీనికి కారణం. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా కీర్తి బరువు తగ్గడంతో ఆమె ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. కీర్తి సురేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో కీర్తి బాగా సన్నగా కనిపిస్తోంది. ఇంత సన్నగా మారడంతో ట్రోలింగ్ తో పాటు మంచి అవకాశాన్ని చేజార్చుకుంది కీర్తి. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలగాలని కీర్తి కలలు కూడా కన్నది. అవన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. కీర్తికి బాలీవుడ్‌ ఛాన్స్‌ మిస్సయింది. ఆమె స్థానంలో ప్రియమణి వచ్చి చేరింది. కారణం.. కీర్తి సన్నపడి, చిన్నపిల్లలా కనిపించడమేనట. లావుగా ఉంటే లావుగా ఉన్నావన్నారు….ఇప్పుడు సన్నపడితే చిన్నపిల్లలా వున్నావంటున్నారు.. ఎలా వీరితో వేగాలని కీర్తి తన సన్నిహితుల వద్ద వాపోతూ.. దీనిపై ఓ క్లారిటీకి రావాలని ఫిక్సయిందట. అంటే లావుగా ఉండాలో.. లేక సన్నగా ఉండాలో అనే విషయంపై త్వరలోనే తన నిర్ణయాన్ని బయటకు తెలియజేస్తానంటుందట.

Related posts