నూతన నటీనటులు.. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలలో నటిస్తున్న ‘రాహు’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రంలా కనిపించినా.. ఇదో థ్రిల్లర్ మూవీ. టెక్నికల్గా హైస్టాండర్డ్స్లో ఉండబోతుంది. ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్ని ప్రజెంట్ చేస్తూనే అనుక్షణం ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే విధంగా కథనం సాగుతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి ప్రధాన ఆకర్షణ. థ్రిలర్స్ తెలుగులో కొత్త ట్రెండ్ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్గా మా టీం ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్గా ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం అన్నారు.