telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిద్దిపేటలో నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోంది : హరీష్ రావును టార్గెట్ చేసిన బిజేపి

సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా అని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతిఫైర్ అయ్యారు. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా ? అని నిలదీశారు. కోవిడ్ నిబంధనలకు లోబడి PPE kits వేసుకుని హాస్పిటల్ లోకి వెళ్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? రోజు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్న వాళ్లపై ఎంత మంది పై కేసులు పెట్టి కోర్టు ముందు ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ధి, హరీష్ రావు చెప్పుకుంటున్న అభివృద్ధి అంత డొల్ల అని తేలిపోయిందని.. సిద్దిపేటలో డమ్మీ అభివృద్ది బుడగ త్వరలో పగలడం ఖాయమన్నారు. సిద్దిపేట హాస్పిటల్లో కరోనా పేషేంట్లను పట్టించు కోవట్లేదని వాళ్ళ బంధువులు, టీఆరెస్ నేతలే వీడియో మెసేజ్ లు పెట్టినారని ఆరోపణలు చేశారు. సిద్దిపేట సర్కార్ దవాఖానకు పోతే చచ్చినట్లే అని పేషేంట్ల బంధువులు చెబుతుంటే అక్కడి చిన్న దొరకు, ఫామ్ హౌజ్ పెద్ద దొరకు వినిపించడం లేదా ? అని ఎద్దేవా చేశారు. వాస్తవాలు చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సిద్దిపేట జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణా రెడ్డి, ప్రధాన కార్య దర్శి పద్మ గౌడ్ పై కేసులు పెట్టిస్తారా? ఇది అరాచక పాలనకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. PPE kit లేకుండా గాంధీ, ఎంజీఎంలో తిరిగిన సీఎం పై ఏ కేసు పెట్టాలి.. ఆరోగ్య శ్రీ వెంటనే కరోనా చికిత్సను చేర్చాలి… ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

Related posts