telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కరోనా” కోసం ఒకే తెరపై బిగ్ బి, రజినీ, మెగాస్టార్…

Movie

కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రకటించారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. అటు బాలీవుడ్ మొదలు ఇటు దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. మ్యూజిక్‌ వీడియోలు లాంటివి చేసి అందరికీ జాగ్రత్తలు చెబుతున్నారు. కాగా కరోనాపై మరింత అవగాహన పెంచేందుకు ఇప్పుడు ఓ షార్ట్‌ ఫిలింను చేశారు. ఫ్యామిలీ అనే పేరుతో రాబోతున్న ఈ లఘు చిత్రంలో చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌తో పాటు తదితరులు భాగం అవ్వబోతున్నారు. ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో బిగ్ బీ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఇంట్లోనే ఉండటం, జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, పరిశుభ్రతను పాటించడం తదితర విషయాలను వివరించనున్నారు. సోమవారం రాత్రి 9గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ఈ లఘు చిత్రం ప్రసారం కానుంది.

Related posts