తమిళ అగ్ర దర్శకుడు శంకర్, ప్రఖ్యాత హాస్యనటుడు వడివేలు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శంకర్ రూపొందించిన పలు సినిమాల్లో వడివేలు కీలక పాత్రలు పోషించాడు. వడివేలు హీరోగా రూపొందింన “హింసించే 23వ పులికేసి” సినిమాను శంకర్ నిర్మించాడు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్పై విమర్శలు కురిపించాడు వడివేలు. అలాగే “23వ పులికేసి” సినిమా గురించి కూడా స్పందించాడు. “కెరీర్ ప్రారంభం నుంచి గ్రాఫిక్ సన్నివేశాలతోనే దర్శకుడిగా శంకర్ నెట్టుకొస్తున్నాడు. ఆయన కేవలం ఓ గ్రాఫిక్స్ డైరెక్టర్ మాత్రమే. అంతకు మించి ఆయనలో విషయం లేదు. ఇక “23వ పులికేసి” డైరెక్టర్ శింబుదేవన్కు అసలు దర్శకత్వమే రాదు. ఆ సినిమాలో చాలా సీన్లకు నేనే దర్శకత్వం వహించా. స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేశా. శింబుదేవన్ సింగిల్ లైన్తోనే నా దగ్గరకు వచ్చారు. మిగిలిన కథంతా నేనే డెవలప్ చేశాను” అని వడివేలు చెప్పారు.
previous post
next post
నాగబాబు కామెంట్-3: కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి