telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సమావేశం!

jagan attending guntur iftar tomorrow

ఏపీ సీఎం జగన్ తో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్ అజయ్ కల్లం ఈ రోజు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా తనకు సలహాదారు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి అజయ్ కల్లం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం.

1983 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం నిక్కచ్చిగా వ్యవహరించే మనిషిగా పేరుపొందారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కొద్దికాలం పనిచేశారు. 2017, మార్చి 31న పదవీవిరమణ చేశారు. గతంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా, టీటీడీ ఈవోగానూ ఆయన సేవలు అందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

Related posts