తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలిలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు ఆమోదం లభించిన విషయం విదితమే. ఈ బిల్లును గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
ఈ క్రమంలో భూ హక్కులు, పాసు పుస్తకాలు, వీఆర్వోల రద్దు, టీఎస్ బీపాస్ చట్టాలు, పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేట్ వర్సిటీ, జీఎస్టీ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చాయని ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను న్యాయశాఖ జారీ చేసింది.
తాజా ఉత్వర్వులతో ఈ బిల్లులన్నీ అధికారికంగా అమల్లోకి రానున్నాయి.తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ మేరకు రాష్ర్ట న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదు: సుప్రీంకోర్టు సీజే బాబ్డే