telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ..నలుగురికి తీవ్ర గాయాలు

ycp party

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అంతర్గత విబేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. అనంతపురం జిల్లాలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన పుట్లూరు మండలం గరుగుచింతలపల్లిలో జరిగింది.

పెద్దిరెడ్డి, భోగతి నారాయణరెడ్డిల మధ్య జరిగిన ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది. ఇరు వర్గీయులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నేపథ్యంలో గ్రామంలోని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఏంజరుగుతుందోనని గ్రామస్తులు జంకుతున్నారు.

Related posts