ప్రస్తుతం బెంగళూరులోని విద్యానారాయణపుర పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న భీమశంకర్ గతంలో బగ్లౌర్ స్టేషన్లో పనిచేశాడు. మార్చి 29న భీమశంకర్ అక్కడికి సమీపంలోని హార్డ్వేర్ పార్క్ వద్ద “రణం” అనే కన్నడ సినిమా షూటింగ్కు అనుమతినిచ్చాడు. అయితే భీమశంకర్ ఇందుకోసం ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోలేదు. షూటింగ్ సమయంలో ఆ సినిమా యూనిట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, ఫైటింగ్ సీన్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా సిలిండర్ను పేల్చివేసి, పేలుడు దృశ్యాన్ని షూట్ చేశారు. అయితే ఈ షూటింగ్ చూస్తున్న సుమన్ భాను అనే మహిళతో పాటు ఆమె ఐదేళ్ల కుమార్తె అయేషా భానులు ఈ పేలుడు ఘటనలో మృతి చెందారు. దీంతో పోలీసులు బాంబు పేలుడుకు కారకులైన స్టంట్ డైరెక్టర్ సుభాష్, నిర్మాత కనకపుర శ్రీనివాస్లను అరెస్టు చేశారు. ఉన్నతాధికారులను సంప్రదించకుండా కానిస్టేబుల్ హార్డ్వేర్ పార్క్ వద్ద సినిమా షూటింగ్కు అనుమతిచ్చిన నేపధ్యంలో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.
previous post
next post