telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కరోనాకు బయపడి సినిమా వాయిదా వేసిన వర్మ…

Ramgopal varma

ప్రస్తుతం మన దేశంలో రోహుకు దాదాపుగా 30 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ కేవలం దేశంలోని మిగితా రాష్ట్రలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తుంది. తెలంగాణలోని పాఠశాలలో కరోనా ప్రభావం చాలానే వుంది. అయితే లాక్ డౌన్ తర్వాత రెండు నెలల కిందట థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాల విడుదల ప్రారంభమైంది. అయితే ఆ వెన్తనె తాను తీసిన కరోనా వైరస్ సినిమాను విడుదల చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సంఘటనల మేరకు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తదుపరి సినిమాను కోవిడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘దేశంలోని అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా తీవ్రమైన కోవిడ్ పెరుగుదల మరియు కొత్త లాక్ డౌన్ వార్తల మధ్య, మేము.. మా స్పార్క్ యూనిట్ ‘డి-కంపెనీ’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించబడుతుంది’ అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాంతో కరోనా కు భయపడను అని చెప్పిన వర్మ ఇప్పుడు భయపడ్డారు అని నెటిజన్లు సొసైల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related posts