telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం: నటి మాధవీలత

madhavilatha

ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం ఉండటం గమనించానని బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఏపీలో ఏ పార్టీ గెలవబోతోందో అక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. ఏ పార్టీపై విశ్వాసం ఉందో తన నోటితో చెప్పనని ప్రజలకు తెలుసని అన్నారు. ఒకోసారి కొన్ని సమీకరణాలు మారుతుంటాయని తెలిపారు. ఎప్పుడైతే కులం, డబ్బు కు లొంగిపోకుండా ఉంటామో అప్పుడే నిజమైన నాయకుడిని ఎన్నుకోగల్గుతామని అన్నారు.

తెలుగు వాళ్లు డబ్బుల కోసం ఓట్లు వేస్తారని దేశ, విదేశాల్లో చెప్పుకుంటున్నారని అన్నారు. మన పరువు మనమే తీసుకునే స్థాయికి దిగజారుతున్నామని తెలిపారు. గుంటూరులో కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువని అన్నారు. ఇంకా, నిజాయతీ గల నాయకులు ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుని ఉంటే, వారు ఎటు వైపు మొగ్గు చూపారో వాళ్లే సీఎం అవుతారని చెప్పారు.

Related posts