తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం భద్రాచలపుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భద్రాచల రాముడు అందరి దేవుడు అని అన్నారు. లక్షలాది మంది దర్శించుకుని తరించుకునే పణ్యక్షేత్రమని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో అన్నిమతాలు, వర్గాల విశ్వాసాలను కాపాడుతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ అన్నిమాతాల పండగలు, విశ్వాసాలను కాపాడుతున్నారని అన్నారు. దేవాలయాల పునరుద్దరణ చేసి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థించినట్టు పేర్కొన్నారు.