telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాహిద్‌ కపూర్‌తో రొమాన్స్‌కు రెడీ అయిపోయిన రాశీఖన్నా

రాశీఖ‌న్నా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ బిజీగానే ఉంది. 2014లో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే అనే చిత్రంలో క‌థానాయికగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల విడుద‌లైన‌ జై ల‌వ‌కుశ‌,ట‌చ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక తమిళంలోను తన హ‌వా చూపిస్తున్న రాశీ ఖ‌న్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్‌’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో త‌మిళ తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్‌కి జోడీగా అయోగ్య అనే చిత్రాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన‌ ‘సైతాన్‌ కా బచ్చా’, “సంగ తమీజన్” , క‌డాసి విడాసై అనే త‌మిళ‌ చిత్రంలో నటిస్తున్నారు. అయితే..తాజాగా ఈ భామ మరో రూటును ఎంచుకుంది. సమంత, సాయిపల్లవి, తమన్నాల మాదిరిగానే ముద్దుగుమ్మ రాశీఖన్నా వెబ్‌సిరీస్‌ల బాట పట్టింది. రాజ్-డీ.కేల దర్శకత్వంలో ఆమె నటించనుంది. ఇందులో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌ చిత్రీకరణ జనవరిలో మొదలు పెట్టనున్నారు. తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతితో పాటు పలువురు దక్షిణాది నటులు ఇందులో నటిస్తున్నారట. రాజ్‌-డీ.కేల “ది ఫ్యామిలీ మేన్‌-2” తో సమంత వెబ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తాజాగా రాశీఖన్నా కూడా వెబ్‌ సిరీస్‌లో నటించనుంది.

Related posts