రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ,టచ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన ‘సైతాన్ కా బచ్చా’, “సంగ తమీజన్” , కడాసి విడాసై అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అయితే..తాజాగా ఈ భామ మరో రూటును ఎంచుకుంది. సమంత, సాయిపల్లవి, తమన్నాల మాదిరిగానే ముద్దుగుమ్మ రాశీఖన్నా వెబ్సిరీస్ల బాట పట్టింది. రాజ్-డీ.కేల దర్శకత్వంలో ఆమె నటించనుంది. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. యాక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ జనవరిలో మొదలు పెట్టనున్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పాటు పలువురు దక్షిణాది నటులు ఇందులో నటిస్తున్నారట. రాజ్-డీ.కేల “ది ఫ్యామిలీ మేన్-2” తో సమంత వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తాజాగా రాశీఖన్నా కూడా వెబ్ సిరీస్లో నటించనుంది.
previous post
next post