అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ నెటిజన్… అమితాబ్ కరోనాతో చచ్చిపోతాడంటూ కామెంట్ పెట్టాడు. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్బీ అతడికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా అభిషేక్ని కించపరుస్తూ పోస్ట్ చేశాడు. ”మీ నాన్న ఆసుపత్రిలో ఉన్నాడు కదా. మరి ఎవరి భరోసాతో కూర్చొని తింటున్నావు..?” అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు. దానికి అభిషేక్ స్పందిస్తూ.. ’ప్రస్తుతానికి కూర్చొని కాదు. పడుకుని భోజనం చేస్తున్నా. మా నాన్న కూడా నాతోనే ఆసుపత్రిలో ఉన్నారు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఆ తరువాత ఆ నెటిజన్ ”త్వరగా కోలుకోండి సర్. ఎవరి రాత ఎలా ఉందో ఎవరూ చెప్పలేరు” అంటూ కామెంట్ పెట్టగా.. ”మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను ప్రార్థిస్తున్నా. మీ విషెస్కి ధన్యవాదాలు” అని అభిషేక్ కూల్గా సమాధానం ఇచ్చారు. అభిషేక్ కూల్ గా సమాధానం చెప్పిన తీరుకు ప్రసంశలు కురిపిస్తున్నారు నెటిజన్లు.