వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని మొదటి పాటను ఇటీవల స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేసిన విషయం విదితమే. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం నుండి విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఈ పాట 10 మిలియన్ వ్యూస్ కొల్లకొట్టింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ‘ఉప్పెన’ చిత్రం నుండి మరో బ్యూటిఫుల్ సాంగ్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్’ అంటూ శరత్ సంతోష్, హరిప్రియ ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఆయనకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో పాటు దేవి శ్రీ కంపోజ్ చేసిన సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.
previous post