డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా “విరాటపర్వం 1992” పేరుతో ఓ విలక్షణ కథాంశం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ముఖ్యపాత్రలో కనిపించనుంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేసిన సాయి పల్లవి పుట్టిన రోజు మే 9. ఈ సందర్భంగా ఆమె తాజా సినిమా ‘విరాటపర్వం’ నుంచి సర్ప్రైజింగ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒకవైపు సాయి పల్లవి లుక్ వైరల్ అవుతుంటే… మరోవైపు ఈ సినిమాకు సంధించిన ఓ విషయమొకటి బయటకు వచ్చింది. యూనిట్ సభ్యులకు అనుకోని ప్రమాదం ఎదురైందట. వివరాల్లోకెళ్తే.. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఓరోజు యూనిట్ సభ్యులు లొకేషన్ నుండి వారుంటున్న ప్రాంతంకి తిరుగు ప్రయాణమైయారు. ఆ సమయంలో వారికి పెద్ద ఏనుగుల గుంపు ఎదురైందట. ఏనుగులు దాడి చేసే ప్రమాదం ఎక్కువ ఉందని భావించిన యూనిట్ సభ్యులకు ఏం చేయాలో తెలియలేదట. దాంతో వారు వెనక్కి తిరిగి పరిగెత్తారట. చాలా సేపు తర్వాత మళ్లీ వారున్న ప్రాంతానికి చేరుకున్నారట.
previous post