“సైరా నరసింహారెడ్డి” సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుంది. కోకాపేటలో వేసిన భారీ సెట్లో సినిమాను చిత్రీకరిస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్లో నటించాలని హీరోయిన్ రెజీనా కసండ్రను చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే డిఫరెంట్ పాత్రలు, నెగటివ్ రోల్స్లో నటిస్తోన్న రెజీనా.. స్పెషల్ సాంగ్లో నటించడానికి నో చెప్పేసిందని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై రెజీనా ఎలా స్పందిస్తుందో చూడాలి. దేవదాయ శాఖలో జరిగే అవినీతిని ఆరికట్టే నేపథ్యంలో సినిమా రూపొందనుందని టాక్. సినిమాను 2020 ఆగస్ట్లో విడుదల చేయబోతున్నారట. ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
next post
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక వ్యాఖ్యలు…