telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరులపై ఎఫ్‌ఐఆర్‌…

కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌, యూఏఈ, యూరోపియన్‌ దేశాల నుంచి మన దేశానికి వస్తున్న ప్రయాణీకులను వారం రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహారాష్ట్ర సర్కార్‌ కూడా కరోనా నిబంధనలను కఠినంగానే అమలు చేస్తోంది. ప్రయాణీకులు ఎవరైనా సరే క్వారంటైన్‌లోకి పంపుతోంది. అయితే..ఇటీవల దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులు ఈ నియమాన్ని పాటించలేదు. విమానాశ్రయం నుంచి క్వారంటైన్‌కు వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. సల్మాన్‌ సోదరుడు సోహైల్‌ ఖాన్‌ ఆయన కుమారుడు నిర్వాణ ఖాన్‌, మరో బ్రదర్‌ అర్భాజ్‌ ఖాన్‌ మొత్తం ముగ్గురు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. దీనిపై బీఏసీ వైద్యాధికారి వారి ఫిర్యాదు చేయగా నగరంలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నగరంలో క్వారంటైన్‌ కోసం కేటాయించిన ఓ హోటల్‌కు ఆ ముగ్గురిని తరలించారు. గతంలో సల్మాన్‌ ఖాన్‌ తన వ్యక్తిగత డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో స్వచ్ఛందంగా హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

Related posts