సూపర్ స్టార్ రజినీ కాంత్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి లో చేరారు రజనీకాంత్. బిపి పెరగడంతో రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇటీవలే అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. ఈ షూటింగ్లో కరోనా కలకలం రేపింది. దీంతో షూటింగ్ సిబ్బంది లో ఆరుగురికి కరోనా సోకింది. కరోనా నేపథ్యంలో ఆ షూటింగ్కు బ్రేక్ పడింది. షూటింగ్ సిబ్బందికి కరోనా రావడంతో హైదరాబాద్లోనే హోం క్వారంటైన్లో ఉంటున్నారు రజనీకాంత్. ఇవాళ హైబీపీతో తీవ్ర అస్వస్థతకు గురైన రజనీ … జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అలాగే ఆయన పరీక్షలు (ఈ నెల 22వ తేదీ) చేయించుకోగా కరోనా నెగిటివ్ గా అని వచ్చింది. తాజాగా మరోసారి రజనీకాంత్ కు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్థారణ అయింది. రజనీకాంత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
previous post
హీరో సిద్ధార్థ్ పై నయనతార బాయ్ ఫ్రెండ్ అసహనం