కారు షెడ్డు నిర్మాణం కోసం ముంబై మహా నగరంలో చెట్లను న రికివేసేందుకు రంగం సిద్ధమైంది. ఆరే కాలనీలో ఉన్న సుమారు 2500 భారీ వృక్షాలను నరికివేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో వందలాది మంది కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆరే కాలనీలో ముంబై మెట్రో కోసం అక్కడో కారు షెడ్డును నిర్మించనున్నారు. దీని కోసం ఆ కాలనీలో ఉన్న భారీ వృక్షాలను తొలగించాలని భావించారు. కోర్టు అనుమతితోనే చెట్ల నరికివేత కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి బుల్డోజర్లు రావడంతో కొందరు ఆందోళనకారులు నరికివేతను అడ్డుకన్నారు.వృక్షాలను పెకిలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కావడంతో ఆరే కాలనీలో భారీ సంఖ్యలో జనం గుమ్ముగూడారు.
అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదు: కళా వెంకట్రావ్