telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని చంద్రబాబు పారిపోయారు: మోత్కుపల్లి

Mothkulapalli comments Chandrababu

ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఏపీ సీఎం చంద్రబాబు పారిపోయారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీని భూస్థాతం చేసింది చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు.

బాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. .బాబు వెన్నుపోటు కారణంగానే తెలంగాణలో టీడీపీ కనుమరుగైందన్నారు. తెలంగాణలో పురుడు పోసుకున్న టీడీపీకి ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. పార్టీ అభివృద్ధి కోసం జీవితం ధారపోశానన్నారు. విభజన తరువాత జాతీయ పార్టీగా ఉంటుందన్నారు. . తెలంగాణలో టీడీపీని నమ్ముకున్న వారు ఏమై పోవాలని నిలదీశారు.

Related posts