telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మీటర్లు టీఆర్ఎస్ నాయకులకు పెడతాం

BJP Bandi sanjay

టీఆర్ఎస్ పార్టీ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులు ను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని..కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుందన్నారు. రేషన్ బియ్యం లో బీజేపీ 29 రూపాయలు ఇస్తుందని..1500 కోట్ల తో రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చామని పేర్కొన్నారు. పింఛన్లు విషయం లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తుందని..బూట్ పాలిష్ నాయకులు సవాళ్ల కి నేను స్పందించను, సీఎం రావాలన్నారు. బీజేపీని కాదు, ప్రజా స్వామ్యాన్ని గెలిపించండి అని కోరారు. ఆరు నెలలు పాప , మహిళలు అని చూడకుండా అధికారులు ప్రవర్తించారని..కలెక్టర్ ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాడని ఫైర్ అయ్యారు. సీపీ ని చూసి పోలీస్ ఉద్యోగమే వద్దు అనుకుంటున్నారు. సీపీ ని చూసి పోలీస్ అమరులు ఆత్మ క్షోభిస్తుందని..నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసే వాళ్ళు బీజేపీ నాయకులు అని తెలిపారు. హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు గాని అగ్గిపెట్టే దొరకలేదని..మీటర్లు టీ ఆర్ ఎస్ నాయకులకు పెడతామని హెచ్చరించారు. ఉచిత కరెంట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని..సన్న బియ్యం రైతులు రేటు లేక తగల పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts