ఏపీ సీఎం జగన్ ను గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి జగన్ ని ఆయన కలిశారు. వారి వాహనంలోనే వంశీ వచ్చినట్టు సమాచారం. దాదాపు అరగంట సమయం వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. తనపై పెట్టిన అక్రమ కేసులను సీఎంకు వంశీ వివరించినట్లు సమాచారం.
కాగా, వల్లభనేని వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో నేటి ఉదయం బీజేపీ నేత సుజనాచౌదరితో వంశీ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో చర్చించినట్టు సమాచారం.
మోదీ విమర్శల పై స్పందించిన మాయావతి