ఏపీ సీఎం జగన్ తో నగరి ఎమ్మెల్యే రోజా తాడెపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్లో భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తదని ఎమ్మెల్యే రోజా ఆశించారు. అయితే కేబినెట్లో ఆమెకు చోటు దక్కలేదు. దీంతో ఆమె అలకబూనినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అమరావతిలో జరిగిన కొత్త మంత్రుల స్వీకారోత్సవానికి రోజా హాజరుకాలేదు.
పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్ రోజాను క్యాంప్ ఆఫీస్కు రావాల్సిందిగా కబురు పంపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అమరావతికి వచ్చిన రోజా సీఎం జగన్ను కలిశారు. ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవికి బదులుగా నామినెటెడ్ పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎంపీ ధర్మపురి అరవింద్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన