telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ నెల 25వ తేదీనుండి నెట్ ఫ్లిక్స్ ద్వారా ‘భీష్మ’

bheeshma

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ ఇద్దరి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. థియేటర్స్ లో ఈ సినిమా జోరుగా సాగుతున్న సమయంలోనే కరోనా ఎఫెక్ట్ చూపడం మొదలైంది. ఈ కారణంగానే చాలామంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయారు. అలాంటివారిని నెట్ ఫ్లిక్స్ ద్వారా ‘భీష్మ’ పలకరించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వుండిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Related posts