ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా భారీ ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ పంజాబ్లోని గుర్దాస్పూర్ నుంచి పోటీ చేశారు. ఈ కౌంటింగ్లో ఆయన భారీ మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి లైవ్లో సన్నీ డియోల్ ఆధిక్యం గురించి చెప్పే క్రమంలో… డియోల్ బదులు సన్నీ లియోన్ అని నోరు జారారు. వెంటనే తేరుకొని తిరిగి సన్నీ డియోల్ ఆధిక్యం గురించి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై సన్నీ లియోన్ స్పందిస్తూ “ఎన్ని ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాను????” అంటూ సన్నీ ట్వీట్ చేశారు.
previous post
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా