ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. జగన్ విజయం ఖాయమనే విషయం అందరికి అర్థమైంది. దీంతో ఇప్పటికే వైసిపి కార్యకర్తలు జగన్ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు స్టార్ట్ చేశారు. జగన్ సైతం ఈ గెలుపు ముందే ఊహించామంటూ కామెంట్స్ చేశారు. జగన్ గెలుపుపై ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్ కి శుభాకాంక్షలు చెప్పగా, తాజాగా రచయిత కోన వెంకట్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో జగన్ కి విషెస్ చెబుతూ మునుపెన్నడూ చూడని పాలన మీ నుండి ఆశిస్తున్నామని ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పై కొంతమంది నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ ప్రజలను ఆ దేవుడే కాపాడాలంటూ, 420 సీఎం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది చూసిన జగన్ అభిమానులు కొందరు రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో వైసిపి, టీడీపీ అభిమానుల మధ్య వార్ మొదలైంది.
స్కూళ్లలో మౌలికవసతులు ఎలా కల్పిస్తారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి