ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వైఎస్ఆర టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ఆదివారం వైఎస్సార్ టీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిల ఈ మేరకు ప్రకటన చేశారు.
ఈ మేరకు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఇక నుండి నా ఊరు పాాలేరేనని ఆమె ప్రకటించారు. వైఎస్సార్ ఫోటోతో ఖమ్మం జిల్లాలో ఎంతో మంది గెలిచారు. ఇకపై వైఎస్సార్ బలం మన సొంతం. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉందన్నారు.
తెలంగాణలో వైఎస్సార్ పేరు పలికే అర్హత తనకే ఉందని షర్మిల చెప్పారు. అందుకే పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని షర్మిల ప్రకటించారు. వైఎస్ఆర్ పై ఉన్న అభిమానమే తనకు ఉన్న ఆస్తిగా ఆమె పేర్కొన్నారు .వైఎస్సార్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలని వైఎస్ షర్మిల అన్నారు.