telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీసీసీ పదవిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

jaggareddy in pcc race in telangana

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు నూతన పీసీసీ ఎంపిక కోసం రంగంలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్.. అందరికీ సమయం ఇచ్చి మరీ.. అభిప్రాయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే.. తాజాగా…పీసీసీ పదవిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమన్వయంతో పీసీసీ ఎన్నిక జరగాలి అనుకుంటున్నానని… లేదంటే సోనియాగాంధీ ఎవరిని నియమించిన కలిసి పనిచేస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఇంఛార్జి అభిప్రాయ సేకరణ ముగిసిందని… రాహుల్.. సోనియాగాంధీ నిర్ణయం జరగాల్సి ఉందని తెలిపారు. సీనియర్లతో మాట్లాడిన తర్వాత… పీసీసీపై నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోనియాగాంధీ.. రాహుల్ అపాయింట్‌ మెంట్‌ అడుగుతున్నామని.. అపాయింట్‌ మెంట్‌ రాగానే వారిని వెళ్లి కలుస్తామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అందరమూ వెళ్లాలని అనుకుంటున్నామని… మా అభిప్రాయం చెప్పిన తర్వాత సోనియాగాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమేనని పేర్కొన్నారు జగ్గారెడ్డి.

 

Related posts