రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా.. వేణు ఊడుగుల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘విరాట పర్వంస. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 17న గ్రాండ్ గా రిలీజై పాజిటివ్ టాక్తో థియేటర్లలో దూసుకుపోతోంది.
నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. విరాటపర్వం అనే సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు శిఫాలి కుమార్పై విశ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు.
విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చాలావరకు అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నందున సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని కోరారు.