సంక్రాంతి అంటే ఏపీలో కోళ్ల పందాలు ఎలాగో తమిళనాడులో జల్లికట్టు అలాగే. ఈ సంప్రదాయ క్రీడ… ఇప్పుడు పొలిటికల్ ఫైట్కు వేదికైంది. ఇవాళ రాహుల్ గాంధీ… జల్లికట్టు ఉత్సవాలకు హాజరై ఢిల్లీ రైతులకు సంఘీభావం తెలపనుండగా… బీజేపీ చీఫ్ నడ్డా కూడా జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ద్రవిడ గడ్డపై జెండా పాతేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇదే సమయంలో పెద్ద పండగ వేదికగా… జల్లికట్టు సెంటిమెంట్ను పండిస్తూ ఓట్లు కోసం తమిళ తంబీలకు ఆయింట్మెంట్ రాసేందుకు కాంగ్రెస్, బీజేపీలు రంగంలోకి దిగాయి. ఇటు సంక్రాంతి.. మరోవైపు జల్లికట్టు సెంటిమెంట్ ఒకేరోజు రావడంతో పొలిటికల్ గేమ్కు తెరలేపాయి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ… ఇవాళ చెన్నైలో పర్యటిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. నేడు మధురై జిల్లా అవానిపురంలో జల్లికట్టు ఉత్సవాలకు హాజరవుతారు రాహుల్. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా ఆందోళన చేపట్టనున్నారు. ఇటు జేపీ నడ్డా కూడా ఇదేరోజు పర్యటించి… జల్లికట్టును వీక్షించనున్నారు. మరోవైపు గతంలో జల్లికట్టును కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు బీజేపీ నేత ఖుష్బూ. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు నేతలు పర్యటించడం… అదీ ఒకే రోజు కావడం… ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ పర్యటనలతో తమిళనాడు సంస్కృతిని గౌరవిస్తున్నామనే సందేశం తంబీల్లోకి పంపాలన్నది రెండు పార్టీల భావనగా కనిపిస్తోంది. మరోవైపు అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలతో పాటు.. ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కూడా ఈ జల్లికట్టు ఉత్సవాలకు హాజరుకానున్నారు.
previous post
next post
సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో… సుశాంత్ కేసుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు