దేవాలయాలను పరిరక్షించడంపై ఏపీ సర్కార్ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు.
ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని చెప్పారు. ఛలో అమలాపురం కార్యక్రమాన్ని తాను ఇప్పటి వరకు ప్రకటించలేదని అన్నారు. అయినప్పటికీ వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బీజేపీ నేతలు, కార్యకర్తల వివరాలను ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు.
షరీఫ్ నిర్ణయం వెనుక చంద్రబాబు: కొడాలి నాని