telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన సైనికులపై మండిపడ్డ రేణూదేశాయ్‌!

Renudeshai fire to Janasena team

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాజీ భార్య, ప్రముఖ సినీ నటి రేణూదేశాయ్‌ జనసైనికులపై మండిపడ్డారు. జనసైనికులంతా పిచ్చోళ్లని, వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల రేణూదేశాయ్‌ కర్నూల్‌ జిల్లా మంత్రాలయంలో సాక్షి టీవీ యాంకర్‌గా వ్యవహరిస్తూ రైతు సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే.

అదేరోజు అదే నియోజకవర్గంలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. దీంతో పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీనే రేణూదేశాయ్‌ని ఉసిగొల్పుతోందంటూ జనసేన కార్యకర్తలు ఆమెపై విరుచుకు పడ్డారు. ఈ తరుణంలో ఆమె ఘాటుగా స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారి మానసిక స్థితిపై నాకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.ఇన్నాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇకపై అటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts