కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. క్యాబ్స్ బుక్ చేసుకోవదు.. అంబులెన్స్లలో జనాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఓలా, ఉబర్ సంస్థలు కూడా క్యాబ్స్ మూసివేయాలి. నడిపిస్తే కేసులు వేస్తమని సీపీ హెచ్చరించారు.
సోషల్ డిస్టెన్స్ ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు. చెక్పోస్టుల దగ్గర తనిఖీలు ముమ్మరం చేసినం. పిల్లల్ని కూడా ఇండ్లకే పరిమితం చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడొద్దు. నిత్యవసర సరుకులు అమ్మే షాపులైనా సాయంత్రం 7 నుంచి మూసివేయాలని ఉదయం 6 గంట నుంచి 7 గంటల వరకు షాపులు తెరవాలని సూచించారు.